Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ మా ఇంటి జవాన్, ముందు ఆ జవాన్ కి సెల్యూట్: సాయి ధరమ్ తేజ్
"ఎస్.. డెఫినెట్లీ.. ఆయన మా ఇంటికి జవాను. నాకు ధైర్యంగా ఉండటం నేర్పించి.. నన్నొక జవానుగా తయారు చేసింది పవన్ కల్యాణ్ గారు నేను ఇవాళ ఈ స్టేజి మీద నిలుచోవడానికి కారణం.. మా ముగ్గురు మామయ్యలు.
Recommended Video
"చెప్పను బ్రదర్" ఈ ఒక్క మాట ఎంత దుమారం రేపిందో గుర్తుంది కదా.. ఒకే ఒక్క మాట బన్నీకి ఉన్న ఇమేజ్నే మార్చి పడేసింది. ఆ ప్రభావం ఆఖరికి చిరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా కనిపించింది. పవన్ ఫ్యాన్స్ తమ హీరో విషయం లో ఏ చిన్న నిర్లక్ష్యాన్నీ భరించలేరు.
గోల గోల చేసేస్తూంటారు
ఆఖరికి వేరే సినిమాల ఫంక్షన్లలో కూడా పవన్ గురించి చెప్పమని గోల గోల చేసేస్తూంటారు. ఇక మెగా ఫంక్షన్ అయితే చెప్పే మాటేముంది?. ఈ విషయాన్ని బాగానే గుర్తించ్వ్హినట్టున్నడు సాయి ధరవప తేజ్. మామయ్య మీద ఉన్న ప్రేమని లోపలే దాచుకోకుండా బయటకు చెప్పి అభిమానులని సంతోష పెడుతూంటాడు.. లేటెస్ట్ సినిమా జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ తనకెంత ఇంపార్టెంటో చెప్పాడు...
జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులను, ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను ఆకట్టుకున్నారు.
స్పీచ్ ప్రారంభమే
స్పీచ్ ప్రారంభమే చిరు అభిమానులకు, పవన్ అభిమానులకు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ అభిమానులందరికీ నమస్కారాలు తెలుపుతూ ప్రారంభించాడు. తేజు మాట్లాడుతుండగా పవన్ అభిమానులు పవన్ అంటూ నినాదాలు చేశారు.
ఆయన మా ఇంటికి జవాను
అప్పుడు తేజు "ఎస్.. డెఫినెట్లీ.. ఆయన మా ఇంటికి జవాను. నాకు ధైర్యంగా ఉండటం నేర్పించి.. నన్నొక జవానుగా తయారు చేసింది పవన్ కల్యాణ్ గారు. ఇవన్నీ పక్కన పెడితే.. నేను ఇవాళ ఈ స్టేజి మీద నిలుచోవడానికి కారణం.. మా ముగ్గురు మామయ్యలు. నాకు ఎప్పటికీ వాళ్లింటి ముందర నేను జవానులా నిలబడతాను.
ముందుగా ఆ జవాన్కి సెల్యూట్
కల్యాణ్ గారికి ముందు నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఎవరికీ రాని గుర్తింపు ఆయన సోషల్ యాక్టివిటీస్ ద్వారా తెచ్చుకున్నారు. కాబట్టి ముందుగా ఆ జవాన్కి సెల్యూట్." అని పేర్కొన్నారు సాయి ధరమ్. ఇంతకు ముందు ఒకసారి ఒక ఈవెంట్లో ఇలాగే పవన్ అభిమానులను ఆకట్టుకున్న తేజు.. తాజాగా మరోసారి వారి మనసుల్లో స్థానం సంపాదించారు.