Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైరాపై మెగా మేనల్లుడి రియాక్షన్.. అప్పుడే రామ్ చరణ్ని అడిగేశాడు
సిల్వర్ స్క్రీన్పై మెగా హవా మొదలైంది. ప్రపంచమంతా కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సినిమా చూసి ప్రేక్షక లోకం నీరాజనం పడుతోంది. ఓవర్సీస్ తెరలపై పడిన ప్రీమియర్ షో ద్వారా అనుకున్న దాన్ని మించి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సైరా యూనిట్ సహా మెగా అభిమానులంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు.
సైరాలో అన్నీ హైలైట్ సీన్సే..
171 నిమిషాల నిడివితో సైరా సినిమా అబ్బురపరిచిందని అంటున్నారు. బకింగ్ హమ్ ప్యాలెస్ సీన్తో ప్రారంభమై ఆద్యంతం ఆకట్టుకునే సన్నివేశాలతో ముందుకెళ్తుందట సైరా మూవీ. 1857లో జరిగే సిపాయిల తిరుగుబాబు ఎపిసోడ్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యం, ఆయన చేసిన విప్లవం ఇలా అన్నీ సినిమాలో హైలైట్ సీన్సే అనే టాక్ వినిపిస్తోంది.
కెరీర్ లోనే తొలిసారి.. మొదటి షో ద్వారానే
కెరీర్ లోనే తొలిసారి సైరా నరసింహా రెడ్డి సినిమా రూపంలో చారిత్రాక కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరంజీవి. భారీ అంచనాల నడుమ హై రేంజ్ ఉత్కంఠతో మొదలైన ఈ సినిమా ప్రీమియర్ షోస్ అభిమానుల ఈలలు, గోళాలతో హోరెత్తిపోయాయి. మొత్తానికి మొదటి షో ద్వారానే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది సైరా.
|
ఇంతలో సాయి ధరమ్ తేజ్ ఎంటరై..
సైరా రెస్పాన్స్ చూసిన సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా మెగా అభిమానుల్లో మరింత జోష్ నింపేలా ఓ ట్వీట్ చేశాడు. సైరా బల నిరూపణ జరిగింది.. బ్లాక్ బస్టర్.. ఇక పార్టీ ఎప్పుడు? ఎక్కడ అని అడుగుతూ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్కి ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. వేలల్లో లైకుల వర్షం కురుస్తోంది.
రోమాలు నిక్కబొడిచేలా సైరా
రోమాలు నిక్కబొడిచేలా సైరా సన్నివేశాలున్నాయని, ఇక ఈ సినిమా సంచలనాలను ఆపడం ఎవ్వరి తరం కాదనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. ఇక నాన్ సైరా రికార్డ్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మరికొద్ది రోజుల్లో రానుందని పేర్కొంటున్నారు సినీ క్రిటిక్స్.
సైరా నరసింహా రెడ్డి.. పాజిటివ్ రెస్పాన్స్
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. చిత్రంలో అందరి నటనకూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.