Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మూడు ప్లాపులే ఉన్నాయి.. ఈ చిత్రానికి ఓకే చెప్పాక మరో మూడు పడ్డాయి.. సాయి ధరమ్ తేజ్!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
చాలా సరదాగా
సాయి ధరమ్ తేజ్ ఉగాది సందర్భంగా చిత్రలహరి ప్రచార కార్యక్రమాలని ప్రారంభించాడు. తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ తన వరుస పరాజయాల గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ చిత్రంలో తేజు విజయ్ అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన క్యారెక్టర్ చాలా సరదగా ఉంటుందని తేజు చెబుతున్నాడు. సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని ఒకే విధంగా చూసే కుర్రాడిలా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తేజు తెలిపాడు.
మూడు ప్లాపులే
తన పరాజయాల గురించి తేజు సరదాగా మాట్లాడుతుంటే.. కిషోర్ తిరుమల గారు ఈ చిత్రాన్ని మిమ్మల్ని చూసే రాసినట్లు ఉన్నారు అని యాంకర్ తెలిపింది. దీనికి తేజు సరదాగా స్పందిస్తూ అంతకు ముందు నాకు మూడు ప్లాపులు మాత్రమే ఉన్నాయి. ఈ చిత్రానికి ఓకె చెప్పిన తర్వాత మరో మూడు పరాజయాలు ఎదురయ్యాయని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.
అమ్మాయిలంతా
ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ నివేద పెతురాజ్ కూడా పాల్గొంది. టీజర్ లో నివేద పెతురాజ్ చెప్పిన 'అబ్బాయిలు రీచ్ అయ్యే వరకు ఒకలా ఉంటారు.. రీచ్ అయ్యాక అంతా ఒకేలా ఉంటారు' ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి నివేద మాట్లాడుతూ అమ్మాయిలంతా తన పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని తెలిపింది. ఈ డైలాగ్ పై తేజు స్పందిస్తూ ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలు ఇలానే ఉన్నారు అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ
దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తేజు, కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ మధ్య సాగే త్రికోణ ప్రేమ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలకు అద్భుత స్పందన వస్తోంది. చిత్రలహరి చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.