Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నివాళి: ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించిన మెగా హీరో
హైదరాబాద్: సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన నటీనటులు, ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయి ధరమ్ తేజ్ కనిపించాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరితో కలిసి సాయి ధరమ్ తేజ్ ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించారు.
ఇక సాయి ధరమ్ తేజ్-వైవిఎస్ చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన 'రేయ్' చిత్రం విషయానికొస్తే.....వివిధ కారణాలతో షూటింగ్ చాలా కాలం పాటు జరిగింది. షూటింగే చాలా లేటయిందంటే ఇపుడు విడుదల కూడా ఆలస్యం అవుతోంది. గత ఆరు నెలల నుండి ఈచిత్రాన్ని అదిగో విడుదల ఇదిగో విడుదల అంటూ వాయిదా వేస్తూనే వస్తున్నారు.
బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మించారు. సాయిధరమ్ తేజ్, సయామి ఖేర్, శ్రద్ధా దాస్ హీరో హీరోయిన్లు. సాయి ధరమ్ తేజ్ మెగా కుటుంబానికి చెందిన హీరో కావడంతో ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తరచూ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు అదిరిపోయే విధంగా ఉండటం కూడా మరో కారణం. దీంతో పాటు 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంలో కూడా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు.
సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో వైవియస్ చౌదరికి మెగా క్యాంప్ వార్నింగ్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మీరు రేయ్ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారా లేక మా పిల్లా నువ్వు లేని జీవితం విడుదల చేయమంటావా అని నిక్కచ్చిగా నిలదీసి అడిగారని సమాచారం. అయితే పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం మొదట రిలీజై, అది హిట్టైతే తన రేయ్ చిత్రానికి ఖచ్చితంగా మంచి క్రేజ్ వస్తుంది. అయితే ఇక్కడో సమస్య ఉంది. తన రేయ్ చిత్రమే ..సాయి ధరమ్ తేజ చిత్రం అనే క్రెడిట్ తో విడుదల కాదు. ఆ క్రేజ్ మిస్సవుతుంది. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలనే డైలమాలో వైవియస్ చౌదరి ఉన్నారని చెప్పుకుంటున్నారు.