Don't Miss!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మాస్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా!
Recommended Video
సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలుకాబోతోంది. ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలుకాబోతోంది. భగవాన్, పుల్లా రావ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. గతంలో ఈ సినిమా ఉండదని వార్తలు వచ్చాయి. వాటిపై నిర్మాతలు క్లారిటి ఇవ్వడం జరిగింది.
తాజా సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని సినిమా వచ్చే నెల (జూన్) లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ దశలో ఉన్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రానుంది. గోపీచంద్ మలినేని గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ దర్శకుడు కిషోర్తిరుమల దర్శకత్వంలో అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమాలు చెయ్యడానికి అంగీకరించారు. ఆ సినిమాల వివరాలు త్వరలో తెలియనున్నాయి.