Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గీతా ఆర్ట్స్ బేనర్లో నటించబోతున్న సాయి ధరమ్ తేజ్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ద్వారా తెరంగ్రటం చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ సుప్రీం స్టార్ గీతా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయలేదు.
ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బేనర్లో తేజ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల 'ఛలో' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.
తమ ఫ్యామిలీకి చెందిన హీరోలను నిలబెట్టడంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. మంచి కథ దొరకడం, అది సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ లెవల్స్కు సూటయ్యే విధంగా ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ వెంటనే ఈ కాంబినేషన్ సెట్ చేశాడట.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గీతా ఆర్ట్స్ ప్రాజెక్ట్ మొదలవుతుందని టాక్.