twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీతా ఆర్ట్స్ బేనర్లో నటించబోతున్న సాయి ధరమ్ తేజ్!

    By Bojja Kumar
    |

    మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 2014లో 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా ద్వారా తెరంగ్రటం చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ సుప్రీం స్టార్ గీతా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయలేదు.

    ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బేనర్లో తేజ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల 'ఛలో' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

    Sai Dharam Tej next with Geetha Arts

    తమ ఫ్యామిలీకి చెందిన హీరోలను నిలబెట్టడంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. మంచి కథ దొరకడం, అది సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ లెవల్స్‌కు సూటయ్యే విధంగా ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ వెంటనే ఈ కాంబినేషన్ సెట్ చేశాడట.

    ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గీతా ఆర్ట్స్ ప్రాజెక్ట్ మొదలవుతుందని టాక్.

    English summary
    Sai Dharam Tej got his first ever break as a hero with Pilla Nuvvu Leni Jeevitham. That film incidentally is from Geetha Arts. The Supreem star didn’t team up with this established banner again. But now, the sources say he will be doing a film with them next. Venky Kudumula will be directing the flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X