Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమ్మారెడ్డి విమర్శలపై సాయి ధరమ్ తేజ్ ఇలా...!
హైదరాబాద్: ‘మేము సైతం' కార్యక్రమానికి హాజరు కాని వారిపై ఇటీవల దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హాజరు కాని వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. తిరుమలలో మీడియా కంటపడ్డ మెగా ఫ్యామిలీ హీరో, పవన్ కళ్యాణ్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ను ఈ పాయింటప్ వ్యూలో విలేకరులు ప్రశ్నించారు.
దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ...మంచి విషయం కోసం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అయితే విమర్శల గురించి నాకు తెలియదు. వాటిని పట్టించుకోను. నేను కూడా మేముసైతం కార్యక్రమంలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను' అంటూ మరో వివాదానికి తావివ్వకుండా దాటవేత ధోరణి ప్రధర్శించారు సాయి ధరమ్ తేజ్.
ఇటీవల విడుదలైన ‘పిల్లా నువ్వు లేని జీవితం' విజయం సాధించడంతో ఆనందంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తర్వాతి సినిమా గురించి చెప్పారు. దిల్ రాజు బేనర్లో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం చేస్తున్నట్లు తెలిపారు.
ఇక తాను నటించిన తొలి సినిమా, ఇంకా విడుదల కాకుండా అలాగే ఉండి పోయిన, వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ‘రేయ్' విడుదల ఎప్పుడు అని అడగ్గా...ఈ సినిమా విడుదలపై వైవిఎస్ చౌదరే ప్రకటన చేస్తారని తెలిపారు.