Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హీరోయిన్లనే కాదు.. చుట్టుపక్కల అమ్మాయిలనూ పట్టించుకోండి.. సాయి ధరమ్ తేజ్ రియాక్షన్
నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం చిన్నదైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు, సాధారణ ప్రజలకు మధ్య దూరం బాగా తగ్గింది. అయితే కొందరు నెటిజన్ల తీరు మాత్రం పలువురు సెలబ్రిటీలను అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ కోవలోనే ఇటీవలే సాయి ధరమ్ తేజ్పై ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై రియాక్ట్ అవుతూ సందేశమిచ్చారు ఈ మెగా మేనల్లుడు. వివరాల్లోకి పోతే..
రాశి ఖన్నా మీద చేయి.. మెగా మేనల్లుడిపై ట్రోల్స్
ఇటీవల జరిగిన రాశి ఖన్నా పుట్టినరోజు సందర్బంగా రాశి ఖన్నా, సాయి ధరమ్ తేజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో వారిద్దరూ చాలా క్లోజ్గా కనిపించారు. దీంతో ఆ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు రాశి ఖన్నా మీద చేయి తీయమని సాయి ధరమ్ తేజ్పై ట్రోల్స్ చేశారు. ఇదే అంశంపై తాజాగా దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.
మీ చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో..
‘‘హీరోయిన్ విషయంలోనే కాదు.. మీ చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో కూడా బాధ్యతగా ప్రవర్తించండి'' అంటూ ఘాటుగా మెసేజ్ పెట్టాడు సాయి ధరమ్ తేజ్. హీరోయిన్ మీద చూపించిన బాధ్యత.. చుట్టూ ఉన్న అమ్మాయిల విషయంలో కూడా చూపితే.. ఎలాంటి అత్యాచార ఘటనలూ జరగవని ఆయన ట్వీట్ చేశారు.
|
హీరోయిన్ మీద చెయ్యి వేస్తేనే అలా అన్నారు మరి..
‘‘ఇవన్నీ
నన్ను
ఆలోచనలో
పడేశాయి.
మీ
అభిమాన
హీరోయిన్
మీద
చెయ్యి
వేస్తేనే..
'చేయి
తీయ్'
అన్నారు.
అది
సినిమాలో
భాగమని
తెలిసి
కూడా
మీరు
స్పందించారు.
అంతే
ప్రేమ,
బాధ్యత
మీ
చుట్టూ
ఉన్న
అమ్మాయిల
మీద
కూడా
చూపిస్తే
మన
సమాజంలో
ఎలాంటి
అత్యాచార
ఘటనలూ
జరగవు
కదా''
అని
తన
ట్వీట్లో
పేర్కొన్నాడు
సాయి
ధరమ్
తేజ్.
Recommended Video
సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా.. ప్రతి రోజు పండగే
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా ‘ప్రతి రోజు పండగే' సినిమా తెరకెక్కుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, విజయకుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.