యుద్ధం గెలిచామా.. లేదా? అన్నదే ముఖ్యం: మారుమోగుతున్న "జవాన్" (డైలాగ్)
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే యూత్ను ఆకట్టుకునేలా రోమాంటిక్గా సాగే పాటలను విడుదల చేసిన చిత్ర యూనిట్..
Recommended Video

సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే యూత్ను ఆకట్టుకునేలా రోమాంటిక్గా సాగే పాటలను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా భావోద్వేగాలతో కూడిన ట్రైలర్ను గురువారం రిలీజ్ చేసింది.

దేశభక్తి నేపథ్యం
ఫ్యామిలీ సెంటిమెంట్లకు దేశభక్తి నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. హీరోయిన్ అందాలు, సాయి ధరమ్ తేజ్ నటన ఈ మూవీకి హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సూపర్బ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు.

ఆక్టోపస్ మిసైల్ సిస్టమ్
హీరోతో సమానంగా విలన్ ప్రసన్న కూడా తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ట్రైలర్ చూస్తుంటే.. సినిమా దాదాపు ఆక్టోపస్ మిసైల్ సిస్టమ్ కేంద్రంగా నడుస్తుందనిపిస్తోంది. లైఫ్లో మనకేదైనా మిస్ అయిందంటే.. దానర్థం మనం దేనికి పనికి రామని కాదురా.. మనం ఇంకా దేనికో పనికొస్తామని. అనే డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

యుద్ధం గెలిచామా.. లేదా
అంతేకాదు ట్రైలర్లో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా చూపించారు. యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా.. ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా.. లేదా? అన్నదే ముఖ్యం అంటూ తేజు చెప్పే డైలాగ్ అదిరింది. ముఖ్యంగా ఈ థియేట్రికల్ ట్రైలర్ సినిమా రేంజ్ని పెంచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
డిసెంబర్ 1న
ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. బీవీఎస్ రవి దర్శకత్వంలో మెహ్రీన్ హీరోయిన్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 1న జవాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరం తేజ్ కి ఈ మూవీ హిట్ అవ్వడం ఎంతో అవసరం. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ అందుకుంటే కాస్త కెరీర్ ఒక దారిలో పడొచ్చు.


Click it and Unblock the Notifications











