Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రేయ్ : ప్రియురాలు అమ్మకానికి..? (ఫోటోలు)
హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై వైవిఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. హీరోయిన్ సయామీ ఖేర్ ప్రముఖ నటి షబానా అజ్మీ మేనకోడలు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ ప్రియురాలిగా నటిస్తోంది.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 11న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వరుస స్లాపు సినిమాలు నిర్మించి నష్టాలో ఉన్న వైవిఎస్ చౌదరి ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
తాజాగా విడుదలైన ఈచిత్రం ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తన ప్రియురాలిని అమ్మకానికి పెట్టినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. మరి ఈ ఏ సందర్బానికి సంబంధించిందో సినిమా విడుదలైతే కానీ చెప్పలేం...
సాయి ధరమ్ తేజ్
సినిమాను మాస్, క్లాస్ ఆడియన్స్, యూత్ మెచ్చే విధంగా పూర్తి కమర్షియల్గా రూపొందిస్తున్నాము అని చెబుతున్న వైవిఎస్ చౌదరి హీరో సాయి ధరమ్ తేజకు మెగా ట్యాగ్ ఉండటంతో భారీగానే ఖర్చు పెడుతున్నాడు. సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాతో ఖర్చుకు వెనకాడటం లేదు.
కోటిన్నరతో సాంగు
సినిమా క్లామాక్స్ సాంగుకు ఏకంగా కోటిన్నర ఖర్చు పెట్టారు. దీంతో పాటు సినిమా కథా పరంగా ఎక్కువ శాతం అమెరికా, ఇతర దేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ జరిపారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం వైవిఎస్ అంచనాలు ఓవర్గా ఉన్నాయి అంటున్నారు.
సాయి ధరమ్ తేజ్
మెగా హీరో అనే ట్యాగ్ ఉన్నప్పటికీ తొలి సినిమాకు రూ. 30 కోట్లు వస్తాయని ఆశించడం తప్పే అవుతుందని, ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో భారీగా ఖర్చు పెట్టి రిస్క్ చేసాడని అంటున్నారు. ఇప్పటి వరకు కొత్తగా ఎంటరైన హీరోకు ఆ రేంజిలో వసూళ్లు రాలేదు.
వైవిఎస్ చౌదరి
గతంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన తొలిసినిమా ‘చిరుత' బిజినెస్ రూ. 25 కోట్లు దాటలేదనే విషయాన్ని ట్రేడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల అల్లు శిరీష్ ‘గౌరవం' పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి అంచనాలు ఏమేరకు రీచ్ అవుతాయో చూడాలి.
సయామీ ఖేర్
హీరోయిన్ సయామీ ఖేర్ ప్రముఖ నటి షబానా అజ్మీ మేనకోడలు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ ప్రియురాలిగా నటిస్తోంది. అక్టోబర్ 11న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.