Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ప్రతి విమర్శకు సమాధానం చెబుతా.. రెజీనా నాకు స్పెషల్.. సాయి ధరమ్ తేజ్!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీనితో తేజు చిత్రలహరిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్నాడు. తేజు సరసన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ చిత్రలహరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరుసగా ప్లాపులు
సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీం చిత్రమే అతడికి చివరి హిట్. ఆ తర్వాత ఆరు చిత్రాలూ నిరాశపరిచాయి. దీనితో కథల ఎంపిక విషయంలో సాయి ధరమ్ తేజ్ పై విమర్శలు చెలరేగాయి. కెరీర్ ఆరంభంలో తేజు మెగా హీరోగా మంచి హైప్ వచ్చింది. ఆరంభంలో కొన్ని హిట్స్ పడ్డా సక్సెస్ ని నిలబెట్టుకోవడంలో తేజు విఫలమయ్యాడు. దీనితో తపై వస్తున్న విమర్శలకు తేజు సమాధానం ఇచ్చాడు.
ప్రతి విమర్శకు సమాధానం
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రలహరి చిత్ర విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. నాపై విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది. నాపై విమర్శలు చేసేవారందరికి చిత్రలహరి చిత్రమే సమాధానం అవుతుందని తేజు హాట్ కామెంట్స్ చేశాడు. చిత్రలహరి ఎమోషనల్ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో ప్రేమ మాత్రమే కాదు.. తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ కూడా ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈ చిత్రంతో కనెక్ట్ అవుతారు అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.
రంగస్థలంకు సీక్వెలా? వైష్ణవ్ తేజ్ భారీ సాహసమే చేస్తున్నాడట.. మెగాహీరోలకు షాకిచ్చేలా!
రెజీనాతో ఎఫైర్
సాయిధరమ్ తేజ్, హాట్ బ్యూటీ రెజీనా మధ్య ఘాటు ఎఫైర్ సాగుతోందని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అనేక రూమర్స్ వచ్చాయి. దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు. నా తొలి చిత్రంలో నటించిన సయామీ ఖేర్ కానీ, రెజీనా కానీ నాకు చాల స్పెషల్. అంతకు మించి మరో రిలేషన్ మా మధ్య లేదు. ప్రస్తుతం నేను సింగిల్ గా చాలా సంతోషంగా ఉన్నా అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.
చిరంజీవి ఇమేజ్
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ నాకు ఉపయోగపడుతుందనేది వాస్తవమే. నాకే కాదు మా ఫ్యామిలిలో అందరి హీరోలకు ఉపయోగపడుతుంది. కానీ అది మొదటి చిత్రానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు నిరూపించుకోవాలి. నాకు ఇప్పుడు పరాజయాలు ఎదురవుతున్న మాట వాస్తవమే. కానీ అంతా మార్చేయడానికి ఒక్క శుక్రవారం చాలు అని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. చిత్రలహరి చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.