twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు మేనల్లుడి 2వ మూవీకి మూహూర్తం ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా మరో సినిమా ఖరారైంది. 100%లవ్ చిత్ర నిర్మాత బన్నీవాసు నిర్మించనున్న ఈచిత్రానికి ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్ బ్యానర్, దిల్ రాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు. నవంబర్ 24న ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుంది.

    ఈ విషయాలను తాజాగా అఫీషియల్ గా ప్రకటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. పూర్తి వివరాలు సినిమా ప్రారంభోత్సవం రోజున ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలు పెట్టారు. సినిమా ప్రారంభాన్ని చాలా గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో 'రేయ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి చక్రి సంగీతం అందిస్తుండగా, గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈచిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లను సంబంధించిన విషయాలు పొందు పరుస్తున్నట్లు తెలుస్తోంది.

    'రేయ్' చిత్రం ద్వారా సయామీ ఖేర్ అనే భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అదే విధంగా హీరోయిన్ శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో పర్మినెంట్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం 'రేయ్' షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

    English summary
    Sai Dharma Tej 2nd movie will be held on 24th. Produced by Bunny Vas of 100% Love fame. Geetha Arts banner and Dil Raju will be the executive producers. A.S. Ravi Kumar Chowdhary will direct this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X