Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్ పరిశ్రమపై సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సాయి కుమార్ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ యాంకర్ గా ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పోలీస్ స్టోరీ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన ఆయన విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమితులయ్యారు.
అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటున్నాడు సాయి కుమార్. ఇటీవల ఆయన మాట్లాడుతూ...కన్నడ సినీ పరిశ్రమ గుర్తించినంతగా తనను తెలుగు సినిమా పరిశ్రమ గుర్తించలేదని వ్యాఖ్యానించారు. కన్నడలో సంవత్సరానికి ఏడెనిమిది సినిమాలు హీరోగా చేస్తున్న సమయంలో కూడా తెలుగు దర్శక నిర్మాతలు తనను కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే చూసారు' అని అన్నారు.
తెలుగులో పోలీస్ స్టోరీ చిత్రం రాకుండా ఉంటే...ఇప్పటికీ అంతా నన్ను మరిచిపోయేవారు' అని వ్యాఖ్యానించారు. తన టాలెంటుకు తగిన అవకాశాలు, పాత్రలు రావడం లేదని సాయి కుమార్ ఫీలువుతున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. అయితే పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చామని అంటున్నారు.