Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్ పరిశ్రమపై సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సాయి కుమార్ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టెలివిజన్ యాంకర్ గా ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పోలీస్ స్టోరీ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన ఆయన విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమితులయ్యారు.
అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదంటున్నాడు సాయి కుమార్. ఇటీవల ఆయన మాట్లాడుతూ...కన్నడ సినీ పరిశ్రమ గుర్తించినంతగా తనను తెలుగు సినిమా పరిశ్రమ గుర్తించలేదని వ్యాఖ్యానించారు. కన్నడలో సంవత్సరానికి ఏడెనిమిది సినిమాలు హీరోగా చేస్తున్న సమయంలో కూడా తెలుగు దర్శక నిర్మాతలు తనను కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే చూసారు' అని అన్నారు.
తెలుగులో పోలీస్ స్టోరీ చిత్రం రాకుండా ఉంటే...ఇప్పటికీ అంతా నన్ను మరిచిపోయేవారు' అని వ్యాఖ్యానించారు. తన టాలెంటుకు తగిన అవకాశాలు, పాత్రలు రావడం లేదని సాయి కుమార్ ఫీలువుతున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. అయితే పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చామని అంటున్నారు.