Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమరావతి శంకుస్థాపన: సాయికుమార్ యాంకరింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ సినీనటుడు సాయికుమార్ను ఎంపిక చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.
సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శన, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో మన అమరావతి, రైతుకు వందనం జానపద, కూచిపూడి నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే ...ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహా మరో 15 మందికి ఆసనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రముఖులు, న్యాయమూర్తులకు మరో రెండు ఇతర వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వేదికలను విదేశీ రాయబారులు, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు కేటాయించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు హాజరుకానున్నట్లు తెలిపారు.
మట్టి, నీరు కలశాలను అందరికీ కన్పించేలా ప్రదర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వేదికపై ప్రదర్శించే నృత్య రూపకాలకు కళాకారులు శివమణి, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వం వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ రాముడు తదితరులు పాల్గొన్నారు.