Don't Miss!
- News మావోయిస్టులకు భారీ షాక్: గడ్చిరోలి ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం!!
- Finance Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అమరావతి శంకుస్థాపన: సాయికుమార్ యాంకరింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ సినీనటుడు సాయికుమార్ను ఎంపిక చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.
సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కళాకారుడు శివమణి వాద్య ప్రదర్శన, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో మన అమరావతి, రైతుకు వందనం జానపద, కూచిపూడి నృత్యరూపకాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే ...ప్రధాన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహా మరో 15 మందికి ఆసనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రముఖులు, న్యాయమూర్తులకు మరో రెండు ఇతర వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వేదికలను విదేశీ రాయబారులు, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు కేటాయించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు హాజరుకానున్నట్లు తెలిపారు.
మట్టి, నీరు కలశాలను అందరికీ కన్పించేలా ప్రదర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వేదికపై ప్రదర్శించే నృత్య రూపకాలకు కళాకారులు శివమణి, కూచిభొట్ల ఆనంద్ నేతృత్వం వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ రాముడు తదితరులు పాల్గొన్నారు.