'యమహో యమ' అంటున్న పూరీ తమ్ముడు
పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజాగా యమహో యమ అనే చిత్రంలో నటిస్తున్నారు. యముడు చుట్టూ తిరిగే ఈ సోషియో పాంఠసీ చిత్రంలో పార్వతిమిల్టన్ హీరోయిన్ గా చేస్తోంది. జితేంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో యముడుగా శ్రీహరి,చిత్ర గుప్తుడుగా అలీ నవ్వించనున్నారు. ఈ చి్త్రం ఓపినింగ్ ఈ రోజే అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ ఓపినింగ్ ఫంక్షన్ కోసం ఓ హెలీకాప్టర్ ని తీసుకున్నారు. బేగంపేటనుంచి ఆ హెలీకాప్టర్ లో బయిలుదేరి అన్నపూర్ణ స్టూడియోకు సాయిరామ్ శంకర్, శ్రీహరి, పార్వతి మిల్టన్ వస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ చిత్రం ప్రారంభం జరగనుంది. ఇక ఈ చిత్రాన్ని జి.వి.కె.ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. జీవికే ఆర్ట్స్ గతంలో ముమైత్ ఖాన్ తో "పున్నమి నాగు" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో మొదలై అమెరికాలో 40రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుతారు. డిశంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: ప్యాట్రిక్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, సంగీతం: శివరంజని.


Click it and Unblock the Notifications











