Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
'వాడే కావాలి' కి రిలీజైన మర్నాడే మొదలు..
సినిమాకు సక్సెస్ మీట్ పెట్టారంటే ఈ రోజుల్లో సాధారణ ప్రేక్షకుడు అది ప్లాఫ్ సినిమా అని ఉట్టినే గుర్తు పట్టేస్తున్నాడు. తాజాగా మొన్న శుక్రవారం రిలీజైన వాడే కావాలి కి రిలీజైన మర్నాడే ఈ చిత్రం హిట్ అనే ప్రమోషన్ నిర్మాతలు మొదలెట్టారు. ఈ సందర్భంగా ఆ చిత్రం నిర్మించిన ఎస్.వి.ఆర్. మీడియా సంస్థ సి.ఇ.ఓ శోభారాణి మీడియాతో మాట్లాడుతూ.. 30 ప్రింట్లతో సినిమాను రిలీజ్ చేశామని, విడుదయిన మరుసటి రోజున మరో 5 ప్రింట్లు పెంచామని, సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందనడానికి ఇంతకుమించి నిదర్శనమేముంటుందని ఆ సంస్థ సి.ఇ.ఓ.శోభారాణి అన్నారు.
అలాగే చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టలేదని, సినిమా నీట్గా ఉందని, ఎంజాయ్ చేశామని చూసినవారు చెబుతున్నారు. క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్కి కూడా స్పందన బాగుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేస్తే ఇబ్బంది పడతామేమోనని కొందరు అన్నప్పటికీ సినిమా మీద నమ్మకంతో విడుదల చేశాం. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు.
దర్శకుడి గురించి.. మా దర్శకుడు రాజేంద్ర దర్శన్ ఇంతకుముందు ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్గా చేసిన అనుభవంతో ఈ సినిమాను బాగా తీర్చిదిద్దారు. ప్రేమలోని ఆ టెండర్నెస్ను చక్కగా విజువలైజ్ చేశారు. అంతేగాక పాట రాగానే ఎవరూ బయటకు వెళ్లకపోవడం ఆనందం కలిగిస్తోంది. అలాగే డైలాగులు కూడా థియేటర్లో బాగా పేలుతున్నాయి.సినిమా విడుదలకు ముందే చెప్పాను మా సినిమా మ్యూజికల్ హిట్ అని. సినిమాలో పాటలను చూసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.