చిత్రలహరి షూటింగ్ కంప్లీట్.. ప్లాపులకు బ్రేక్ పడుతుందా!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజు కెరీర్ కు చాలా కీలకం. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. చిత్రయూనిట్ తో కలసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. చిత్రలహరి షూటింగ్ పూర్తయింది. చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు అని తేజు ట్వీట్ చేశాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాలుగు ప్రధాన పాత్రలు సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేద పెతురాజ్ లని పరిచయం చేస్తూ టీజర్ ని విడుదల చేశారు.

మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆరు వరుస పరాజయాల తర్వాత తేజు నటిస్తున్న చిత్రం ఇది. నేను శైలజ చిత్రంతో దర్శకుడిగా విజయం సొంతం చేసుకున్న కిషోర్ తిరుమలకు ఆ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంలో నిరాశే ఎదురైంది. చిత్రలహరి చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











