తెర వెనక నడిచేవి మీకెందుకు అంటున్న హీరో
ఒక సినిమాను సినిమాగా ఆస్వాదించండి. తెర వెనుక నడిచేవి నడుస్తూనే ఉంటాయి. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం అంటున్నారు సైఫ్ అలీ ఖాన్. అలాగే తెర వెనుక ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం ముఖ్యమైందిగా కావటం పెద్ద సమస్యగా మారింది. దాంతో ప్రేక్షకుల అంచనాలు మారిపోతాయి. అది సినిమా ఉద్దేశాన్ని మింగేస్తుంది అని సైఫ్ వాపోయాడు. బాలీవుడ్ ప్రేమికుల జంట సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ 'ఏజెంట్ వినోద్' చిత్రానికి కలిసి నటించారు. నిజజీవితంలో ప్రేమికులు తెరపై కూడా అదే పాత్రల్లో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఆ చిత్రంపై ఒక విధమైన ఆసక్తి ఏర్పడింది. అయితే అలాంటి అంచనా వద్దని సైఫ్ అలీఖాన్ అంటున్నాడు.
అలాగే నిజజీవితంలో ప్రేమికులను తెరపై చూడటం కోసం సినిమాకు రాకూడదు. తెరపై ఇద్దరు నటులను చూడాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు సినిమా హాల్లోకి అడుగుపెట్టాలి. 'ఏజెంట్ వినోద్' చిత్రాన్ని ఒక దర్శకుడు మనసు పెట్టి తీసిన సినిమాగా చూడండి అని చెప్పారు. 'ఏజెంట్ వినోద్' సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న మూడవ చిత్రం. గతంలో ఆదిత్య చోప్రా నిర్మించిన 'తషాన్', కరణ్ జోహార్ రూపొందించిన 'కుర్బాన్' చిత్రాల్లో వారిద్దరూ జంటగా నటించారు. యాక్షన్ స్పై చిత్రం 'ఏజెంట్ వినోద్' ద్వారా జంటగా ప్రేక్షకులను మైమరిపించేందుకు వస్తున్నారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన 'ఏజెంట్ వినోద్' మార్చి 23న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











