Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
కరీనా,సైఫ్ జంటకు ‘వెజ్ చాక్లెట్’
ముంబై: ఐదేళ్ల సహజీవనం తరువాత మంగళవారం ఒక్కటైన సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటకు జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్ (పెటా) ఒక ప్రత్యేక కానుకను సిద్ధం చేసింది. శాకాహార పదార్థాలతో తయారు చేసిన వెగన్ చాక్లెట్ చికెన్స్కు ఈ నవదంపతులకు కానుకగా ఇవ్వనుంది. కరీనా పూర్తిగా శాకాహారిగా కాబట్టే ఈ నిర్ణయం తీసుకునానమని పెటా ప్రతినిధి పూర్వా జోష్పురా అన్నారు. ఇలాంటి చాక్లెట్ ఇచ్చేందుకు ఇదే తగిన సందర్భమని ఆమె వ్యాఖ్యానించారు. వీరిద్దరూ ముంబైలో మంగళవారం సైఫ్ నివాసంలో పెళ్లి చేసుకున్నారు.
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల వివాహం మంగళవారం మధ్యాహ్నం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. బాంద్రా ప్రాంతంలో ఉన్న సైఫ్ ఇంట్లోనే కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకొని ఒక్కటయ్యారు. రిజిస్ట్రార్ సురేఖ రమేష్ వారి వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. ఈ లాంఛనాలు పూర్తవగానే నూతన వధూవరులు బాల్కనీలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
సైఫ్ అలీఖాన్ వివాహ దరఖాస్తులో తన అసలు పేరైన సాజిద్ అలీ ఖాన్(42)నే రాశారు. ఈ రిజిస్టర్డ్ మ్యారేజీకి కరీనా తల్లిదండ్రులు బబిత, రణ్ధీర్ కపూర్, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సాక్షులుగా సంతకం చేశారు. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, తుషార్ కపూర్, అమృతా అరోరా తదితరులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అతిథుల కోసం బుధవారం పటౌడీలో, గురువారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.
గత అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్న సైఫ్, కరీనా జంట పెళ్లి చేసుకోబోతున్నారని ఈ ఏడాది జనవరి నుంచే ప్రచారం మొదలైంది. వారిద్దరూ జంటగా నటించిన 'ఏజెంట్ వినోద్'. విడుదలైన తరవాత మార్చిలో వివాహ ముహూర్తం ఉంటుందని కూడా అన్నారు. అయితే కరీనా కపూర్ 'హీరోయిన్' సినిమా ఒప్పుకోవడంతో ఇప్పటిదాకా ఆగాల్సి వచ్చింది.