Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కరీనా,సైఫ్ జంటకు ‘వెజ్ చాక్లెట్’
ముంబై: ఐదేళ్ల సహజీవనం తరువాత మంగళవారం ఒక్కటైన సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటకు జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏనిమల్స్ (పెటా) ఒక ప్రత్యేక కానుకను సిద్ధం చేసింది. శాకాహార పదార్థాలతో తయారు చేసిన వెగన్ చాక్లెట్ చికెన్స్కు ఈ నవదంపతులకు కానుకగా ఇవ్వనుంది. కరీనా పూర్తిగా శాకాహారిగా కాబట్టే ఈ నిర్ణయం తీసుకునానమని పెటా ప్రతినిధి పూర్వా జోష్పురా అన్నారు. ఇలాంటి చాక్లెట్ ఇచ్చేందుకు ఇదే తగిన సందర్భమని ఆమె వ్యాఖ్యానించారు. వీరిద్దరూ ముంబైలో మంగళవారం సైఫ్ నివాసంలో పెళ్లి చేసుకున్నారు.
సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ల వివాహం మంగళవారం మధ్యాహ్నం ముంబయిలో నిరాడంబరంగా జరిగింది. బాంద్రా ప్రాంతంలో ఉన్న సైఫ్ ఇంట్లోనే కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో వారిద్దరూ ఉంగరాలు మార్చుకొని ఒక్కటయ్యారు. రిజిస్ట్రార్ సురేఖ రమేష్ వారి వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. ఈ లాంఛనాలు పూర్తవగానే నూతన వధూవరులు బాల్కనీలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
సైఫ్ అలీఖాన్ వివాహ దరఖాస్తులో తన అసలు పేరైన సాజిద్ అలీ ఖాన్(42)నే రాశారు. ఈ రిజిస్టర్డ్ మ్యారేజీకి కరీనా తల్లిదండ్రులు బబిత, రణ్ధీర్ కపూర్, సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సాక్షులుగా సంతకం చేశారు. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, తుషార్ కపూర్, అమృతా అరోరా తదితరులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అతిథుల కోసం బుధవారం పటౌడీలో, గురువారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.
గత అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్న సైఫ్, కరీనా జంట పెళ్లి చేసుకోబోతున్నారని ఈ ఏడాది జనవరి నుంచే ప్రచారం మొదలైంది. వారిద్దరూ జంటగా నటించిన 'ఏజెంట్ వినోద్'. విడుదలైన తరవాత మార్చిలో వివాహ ముహూర్తం ఉంటుందని కూడా అన్నారు. అయితే కరీనా కపూర్ 'హీరోయిన్' సినిమా ఒప్పుకోవడంతో ఇప్పటిదాకా ఆగాల్సి వచ్చింది.