Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా భర్త ఆరోగ్యంతో తిరిగివస్తారు.. సైరా భాను
అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు.
అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లోని ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆయన ఆరోగ్యం గురించి మీడియాకు వివరించారు.
సైరాబాను మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ కుమార్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కోట్లాది మంది అభిమానుల ఆశీర్వాదంతో దిలీప్ కోలుకుంటారు అని అన్నారు. 'అందాజ్', 'మధుమతి', 'దేవదాస్', 'క్రాంతి' తదితర హిందీ చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో దిలీప్ను సత్కరించింది.
ప్రస్తుతం దిలీప్ ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి వైద్యులు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో, డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని ఆయన అన్నారు.