Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా భర్త ఆరోగ్యంతో తిరిగివస్తారు.. సైరా భాను
అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు.
అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లోని ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆయన ఆరోగ్యం గురించి మీడియాకు వివరించారు.
సైరాబాను మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ కుమార్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కోట్లాది మంది అభిమానుల ఆశీర్వాదంతో దిలీప్ కోలుకుంటారు అని అన్నారు. 'అందాజ్', 'మధుమతి', 'దేవదాస్', 'క్రాంతి' తదితర హిందీ చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో దిలీప్ను సత్కరించింది.
ప్రస్తుతం దిలీప్ ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి వైద్యులు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో, డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని ఆయన అన్నారు.