Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా భర్త ఆరోగ్యంతో తిరిగివస్తారు.. సైరా భాను
అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు.
అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లోని ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆయన ఆరోగ్యం గురించి మీడియాకు వివరించారు.
సైరాబాను మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ కుమార్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కోట్లాది మంది అభిమానుల ఆశీర్వాదంతో దిలీప్ కోలుకుంటారు అని అన్నారు. 'అందాజ్', 'మధుమతి', 'దేవదాస్', 'క్రాంతి' తదితర హిందీ చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో దిలీప్ను సత్కరించింది.
ప్రస్తుతం దిలీప్ ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి వైద్యులు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో, డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని ఆయన అన్నారు.