twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "తను వెడ్స్ మను" రీమేక్ హీరో, హీరోయిన్స్ వాళ్ళే ఫైనల్..

    By Srikanya
    |

    మాధవన్, కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన హిందీ చిత్రం "తను వెడ్స్ మనూ" తెలుగులో రీమేక్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోగా మొదట సునీల్ ని అనుకున్నా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ వచ్చి చేరాడు. కంగనారౌనత్ చేసిన పాత్రని ఛార్మి చేయనుందని తెలుస్తోంది.అలాగే దర్సకుడుగా పూరీ దగ్గర అశోసియోట్ గా చేసిన గోపి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఇక రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

    తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు కొత్తగా ఓ సంస్ధను ప్రారంభించి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ రైట్స్ కోసం హిందీ నిర్మాతను సంప్రదించినట్లు తెలుస్తోంది. అలా మొదలైంది విజయం సాధించటంతో అటువంటి రొమాంటిక్ కామిడీలకు గిరాకీ ఉంటుందనే ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

    English summary
    Puri Jagannath’s brother Sairam Shankar would play the hero and Charmi was roped in as heroine for the movie.It is confirmed that a debutant director Gopi, who was associated with Puri Jagannath, was told to wield the megaphone for the film. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X