Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సీతగా సఖి... ఆదిపురుష్ లో కీర్తి సురేశ్ !
డార్లింగ్ ప్రభాస్ అంత పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక, ఇక జనాలు దాని గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలరు. తానాజీ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ 3D యాక్షన్ డ్రామా ఆదిపురుష్ హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ బాషల్లో తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాలో ఆదిరుపురుషుని అర్థభాగం ఎవరికి ఇవ్వాలా అన్న ఆంశంపై తర్జనభర్జనలు సాగుతున్న నేపథ్యంలో అందరి ఇష్ట "సఖి"నే రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
ఈ పురాణేతిహాసంలో ఆదిపురుషుడిగా ప్రభాస్, శ్రీరామచంద్రుని పాత్రలో కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరడుగుల ఆజానుబాహుని సరసన ఆషామాషీ హీరోయిన్ ను కాకుండా ఏకంగా జూనియర్ మహానటిని పట్టుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మహానటి సినిమాతో జాతీయ పురస్కారం పొందిన కీర్తి సురేశ్ అయితేనే సీత పాత్రకు ప్రాణం పోయగలదని దర్శకుడు ఓమ్ రౌత్ ఆలోచిస్తున్నాడు. ఇక టీ-సిరీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఆదిపురుష్, 400 వందల కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కీర్తి సురేశ్ కూడా వరుసగా భారీ ప్రాజెక్ట్ లను తన కిట్ లో వేసుకుంటోంది. త్వరలోనే మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాటలో తళుక్కుమనబోతోంది. ఆదిపురుష్ గానీ ఓకే అయితే, తొలిసారి అమ్మడు ప్రభాస్ తో జోడీ కడుతుంది. ఇక ఈ అందాల జంటను చూసేందుకు రెండు కళ్లూ చాలవనడంతో సందేహమేలేదు.