Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'సాక్షి' ఛానెల్ సాక్షిగా...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాక్షి,మహా ఛానెల్స్ కు లైసెన్స్ లు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. దీంతో స్టూడియో ఎన్,మహా,సాక్షి ఛానెల్స్ మూడు ఫిబ్రవరిలో టెస్ట్ సిగ్నల్స్ ఇవ్వటానికి రెడి అవుతున్నాయి. ఇక జీ ఇవరై నాలుగుగంటలు,ఏసియా నెట్ తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మాత్రం ఇంకా లైసెన్స్ రాలేదని చెప్తున్నారు. దాంతో వారు మరి కొంత కాలం ఆగేటట్లు ఉంది. ఇక ఇప్పటికే టెస్ట్ సిగ్నల్స్ వస్తున్న ఐ న్యూస్,హెచ్.ఎమ్.టివీ త్వరలోనే రెగ్యులర్ ప్రసారాలు సాగిస్తారని తెలుస్తోంది. ఇవన్ని ఇలా ఉంటే అందరి దృష్టి మాత్రం సాక్షి ఛానెల్ మీదే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తల్లా కొన్ని ఛానెల్స్ పనిచేస్తూంటే ఇక సాక్షి పూర్తి సైన్యాధిపతిలా మిగతా వారిపై యుధ్దం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అందులోనూ సాక్షి పేపరు రేటు పెంచి, కొన్ని ఎడిషన్స్ తగ్గించిన నేపధ్యంలో ఇలా వారిదే మరో ఛానెల్ రావటం నైతిక ధైర్యాన్నిచ్చే అంశం అంటున్నారు.ఏదైమైనా సాక్షి ఛానెల్ వస్తే ..న్యూస్ లన్ని సాక్షి...సాక్షిగా తయారవుతాయని కొందరంటున్నారు.