Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సినిమా చూసి ఎంజాయ్ టీమ్ ఇండియా ఆటగాళ్లు.. స్టార్ హీరో కామెంట్స్
Recommended Video
భారత క్రికెట్ జట్టు ప్లేయర్స్ భారత్ సినిమా చూసి తమ స్పందన తెలిపారు. ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటున్న భారత ఆటగాళ్లు తమ ఖాళీ సమయంలో సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ చూసి ఎంజాయ్ చేశారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఆల్ రౌండర్ కేదార్ జాదవ్. ఇది చూసిన సల్మాన్ ఎలా రియాక్ట్ అయ్యాడంటే..
రెండు విజయాలు.. ఫుల్ జోష్
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు మంచి ప్రతిభ కనబరుస్తోంది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే భారత జట్టు ఖాతాలో రెండు విజయాలు చేరాయి. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లు తదుపరి ఆట కోసం కసరత్తులు చేస్తూనే విరామ సమయంలో సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాస్త రిలాక్స్ కోసం భారత్ సినిమా చూశారు టీమ్ ఇండియా ప్లేయర్స్.
|
ఇంగ్లాండ్ లోని నాట్టింగ్ హామ్ లో
వరుస విజయాలతో ఉరకలేసే ఉత్సాహంగా ఉన్న టీమ్ ఇండియా ప్లేయర్స్ ఇంగ్లాండ్ లోని నాట్టింగ్ హామ్ లో 'భారత్' సినిమా వీక్షించారు. ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్ సహా ఇతర ఆటగాళ్లంతా కలిసి సినిమాను ఎంజాయ్ చేశారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
|
కేదార్ జాదవ్ ట్వీట్.. సల్మాన్ రియాక్షన్
తామంతా కలిసి 'భారత్' సినిమా చూశామని టీమ్ ఇండియా ఆటగాడు కేదార్ జాదవ్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు 'భారత్ మూవీ చూసిన తర్వాత భారత జట్టుతో' అంటూ ట్యాగ్ చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు థియేటర్ లో ఆటగాళ్లందరూ కలిసి దిగిన పిక్ కూడా షేర్ చేసి తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. దీంతో ఈ చూసిన సల్మాన్ 'భారత్ చిత్రాన్ని చూసినందుకు.. థాంక్యూ భారత్ టీం.. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ మ్యాచెస్' అని రిప్లై పెట్టాడు. దేశం మొత్తం మీ వెన్నంటి ఉంది అని సల్మాన్ తన ట్వీట్ లో పేర్కొనడం విశేషం.
భారత్ మూవీ.. సల్మాన్, కత్రినా హంగామా
అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందింది 'భారత్' మూవీ. ఈ సినిమాలో దిశా పటాని ముఖ్య పాత్ర పోషించింది. జూన్ 5 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ రాబడుతోంది. చిత్రంలో సల్మాన్, కత్రినా హంగామా హైలైట్ అవుతోంది. సల్మాన్ కెరీర్ లోనే ఈ సినిమా ఓ మైలురాయి అని పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు.