Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అఖిల్ సినిమా చూశా.. మహేష్ ఫ్యాన్స్కు ఝలక్.. మహర్షి రీమేక్పై సల్మాన్ ఖాన్ క్లారిటీ
టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్బాబు నటించిన మహర్షి చిత్రం హిందీలో రీమేక్ అవుతున్నది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై ఆసక్తిచూపుతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియా వర్గాలను విశేషంగా ఆకర్షించింది. మహర్షి సినిమా రిలీజై అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున్న ప్రశంసలు అందుకొంటున్న సమయంలో ఇలాంటి వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ఓ మైలురాయిగా నిలిచిన చిత్రాన్ని ప్రభుదేవాతో కలిసి సల్మాన్ ఖాన్ చూడబోతున్నారు. ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారనే వార్తలపై సల్మాన్ ఖాన్ ఇటీవల స్పందించారు. హిందీ రీమేక్ గురించి ఆయన ఏమన్నారంటే..
మహర్షి మూవీ చూడలేదు
భారత్ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రచారం కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ మహర్షి రీమేక్ వార్తపై స్పందించారు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రాన్ని ఇంత వరకు చూడలేదు. ఆ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. నేను మహర్షి సినిమాను రీమేక్ చేయడం లేదు అని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. మహర్షి రీమేక్ మీడియా సృష్టించిన వార్త అని ఆయన అన్నారు.
అఖిల్ అక్కినేని సినిమా చూశాను
అన్ని భాషల చిత్రాలను చూస్తానని, కానీ ఎక్కువగా టెలివిజన్లో మాత్రమే చూస్తాను. ఈ మధ్యకాలంలో దక్షిణ భారతీయ చిత్రాలను ఎక్కువగా చూశాను. ఈ మధ్య నేను అఖిల్ నటించిన ఓ చిత్రాన్ని చూశాను. ఆ సినిమా పేరు హిందీలో తక్దీర్ అనుకొంటాను అని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. ఇంట్లో టీవీ ఛానెల్ను మార్చనంత వరుకు నా మటుకు నేను సినిమాలు చూస్తూనే ఉంటాను అని తెలిపారు.
బాహుబలి2 మూవీ ఇంకా
ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాహుబలి సినిమాను చూశాను. కానీ రెండో భాగం ఇంకా చూడలేదు. అందుకే కట్టప్పను ఎవరు చంపారో తెలియదు అని సెటైర్ వేశారు. ఇంతకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు అనే ఎదురు ప్రశ్నను మీడియాకు వేశారు. బాహుబలి2 సినిమాను చూడటానికి తనకు సమయం చిక్కడం లేదని అన్నారు.
వెబ్ సిరీస్ల గురించి అభిప్రాయం
వినోద పరిశ్రమలో వెబ్ సిరీస్లు విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. అలాంటివేమైనా చూశారా? అనే ప్రశ్నకు సల్మాన్ ఖాన్ సమాధానం ఇస్తూ.. నా సిస్టర్స్ కొన్ని చూడమని సిఫారసు చేస్తుంటారు. అందులో కొన్నింటిని చూశాను. వాటిలో కొన్ని చెత్తగా ఉన్నాయి. అలాంటి చెత్తను చూడటం వల్ల నాకేమి ఎఫెక్ట్ పడదు. మీరేదైనా పూర్తిగా స్టోరి చెబితే ఇప్పుడు చూస్తానిని సిస్టర్స్కు చెప్పినట్టు సల్మాన్ ఖాన్ తెలిపారు.
జూన్ 5న భారత్ మూవీ రిలీజ్
ప్రస్తుతం సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన భారత్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అతుల్ అగ్నిహోత్రి, సల్మాన్ ఖాన్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దిశా పటానీ, సునీల్ గ్రోవర్, జాకీ ష్రాఫ్, సొనాలి కులకర్ణి, టబు తదితరులు నటించారు. జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ అతిథి పాత్రలో కనిపిస్తారు.