Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కూతురు ఎంట్రీ కోసం శ్రీదేవి ఆ హీరోతో మీటింగ్
ముంబై: శ్రీదేవి కుమార్తె జాహ్నవి ఎంట్రీకి భారీగా ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రాండ్ గా ఆమె ఎంట్రీ జరపాలని శ్రీదేవి ఆలోచన. ఆ మేరకు ఆమె సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్లో ఎందరో యువకెరటాలకు అవకాశం కల్పించిన సల్మాన్ మరోసారి వార్తల్లోకెక్కాడు. బోనీకపూర్, శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవిని తెరంగేట్రం చేయించేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటీవల బోనీకపూర్, శ్రీదేవిని కలుసుకుని జాహ్నవి గురించి చర్చించాడు. వాళ్ల ఇంటికెళ్లినప్పుడు ప్రజలు పెద్దఎత్తున గుమికూడారు కూడా. ఆ సమయంలో 17 ఏళ్ల జాహ్నవి డార్క్ బ్లూ టాప్ ధరించి చేతిలో సెల్ఫోన్తో సల్మాన్ను తదేకంగా చూస్తున్నారు. శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షికి అవకాశమిచ్చిన సల్మాన్.. టైగర్, అథియా శెట్టి, సూరజ్ పంచోలీ, సనాఖాన్ను కూడా తెరంగేట్రం చేయిస్తున్నారు. మరి జాహ్నవి తెరపైకి ఎప్పుడో వేచి చూద్దాం.
రణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో జాహ్నవి బాలీవుడ్కి పరిచయం కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కరుణ్ జోహార్ తో బోనీ కపూర్ చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక,నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు. కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు తన తల్లిలాగే తెలుగులో ఆమె కెరీర్ మొదలుపెట్టే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు. తెలుగులో యంగ్ హీరోల సరసన ఆమెను అడుగుతున్నారని సమాచారం. జాహ్నవి నటించిన సినిమా అంటే ఆ క్రేజే వేరు. దాంతో ఆమె ఎంట్రీ తమకు అంటే తమకు దక్కాలని అంతా పోటీలు పడుతున్నారు.
గత ఏడాది కూడా ఇలాగే పలుమార్లు వార్తలొచ్చినా... తన కూతురు ఇప్పుడే సినిమాల్లోకి రాదని శ్రీదేవి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. జాహ్నవి చదువు పూర్తయ్యాకే తన ఇష్ట ప్రకారం ఆమె కెరీర్ను ఎంపిక చేసుకొంటుందని శ్రీదేవి తెలిపింది. ప్రస్తుతం జాహ్నవి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. సంభాషణలు ఎలా పలకాలో కూడా తెలుసుకొంటోంది. జిమ్లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే జాహ్నవి సినిమాల్లోకి వచ్చే విషయంపై బోనీకపూర్ దంపతులు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు జాహ్నవి తండ్రి బోనీ కపూర్ను ఈ విషయమై సంప్రదించినట్లు సమాచారం. అయితే శ్రీదేవి-బోనీ కపూర్ తమ కూతురును ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి పంపడం ఇష్టం లేదని తేల్చి చెప్పినట్ల తెలుస్తోంది.
జాహ్నవికి సొంతగా నిర్ణయాలు తీసుకునే వయసొచ్చాక ఆమె ఇష్ట ప్రకారం సినీరంగంతో లేదా ఇతర ఏ రంగంలోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, జాహ్నవి చదువులు పూర్తయిన తర్వాత ఏదైనా అని స్పష్టం చేస్తున్నారట. ఈ మధ్య జాహ్నవి తరచూ తల్లితో కలిసి పలు ఫ్యాషన్ షోలలో, వివిధ సినిమా ఫంక్షన్లలో పాల్గొనడం, తన సెక్సీ ఆటిట్యూడ్తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె వ్యవహారం చూస్తుంటే.....మోడలింగ్, ఫ్యాషన్ రంగం, సినిమా రంగంలో ఏదో ఒక రంగాన్ని జాహ్నవి ఎంచుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.