Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ట్యూబ్లైట్కు రూ. 20 కోట్లు.. సల్మాన్ చిత్రం రికార్డు
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్లైట్ చిత్రం విడుదలకు ముందే బాలీవుడ్లో రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్లైట్ చిత్రం విడుదలకు ముందే బాలీవుడ్లో రికార్డులు సృష్టిస్తున్నది. ఇప్పటికే శాటిలైట్స్ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడుపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
మ్యూజిక్ హక్కులు రూ.20 కోట్లు
కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మ్యూజిక్ హక్కులను సోని మ్యూజిక్ రూ.20 కోట్లు చెల్లించి సొంతం చేసుకొన్నట్టు ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ చిత్రంలో మూడంటే మూడు పాటలు ఉండటం గమనార్హం. కేవలం మూడు పాటలకే రూ.20 కోట్లు చెల్లించి సోని హక్కులు దక్కించుకోవడం చర్చనీయాంశమైంది.
దిల్ వాలేకు 19 కోట్లు
గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ రతన్ ధన్ పాయో చిత్రం మ్యూజిక్ రైట్స్ రూ.17 కోట్లు పలికాయి. షారుఖ్ చిత్రం దిల్వాలే మ్యూజిక్ హక్కులు రూ.19 కోట్లకు అమ్ముడుపోయాయి.
ఇండో, చైనా యుద్దం నేపథ్యంగా
ట్యూబ్లైట్ చిత్రం పిరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకొంటున్నది. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఇది పక్కాగా ప్రేమ కథా చిత్రం.
సల్మాన్తో కబీర్ మూడోసారి
ట్యూబ్లైట్ చిత్రానికి దర్శకుడు కబీర్ ఖాన్. సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్జాన్ చిత్రాలకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఏక్ థా టైగర్ రూ.198 కోట్లు, భజరంగీ భాయ్ జాన్ రూ.320 కోట్లు వసూలు చేశాయి.
బాలీవుడ్లోకి చైనా నటి
ఈ చిత్రంలో చైనా నటి జూజూ, దివంగత ఓంపూరి, మహ్మద్ జీషాన్, సోహైల్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2017 జూన్ 23వ తేదీన విడుదల కానున్నది.
అతిథి పాత్రలో షారుక్
భారత్కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ కబీర్ ఖాన్ వెల్లడించారు.