Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
39 కోట్లుతో ముంబైలో ప్లాట్ కొన్న మాస్ హీరో
బాలీవుడ్ మాస్ హీరో,కండల వీరుడు ఇప్పుడు ప్రతీ విషయంలోనూ షారూఖ్ తో పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే సల్మాన్ తాజాగా ఓ ట్రిపులెక్స్ ప్లాట్ ని కొనుగోలు చేసాడు. అదీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఇంటి ప్రక్కనే కావటం విశేషం. వివరాల్లోకి వెళితే.. కింగ్ఖాన్ షారూఖ్ ముంబై బాంద్రాలోని మన్నత్ బంగ్లాలో ఉంటున్నారు. అయితే ఆ బంగ్లా పక్కనే ఉన్న 'ది అడ్రస్' భవనంలో సల్మాన్ఖాన్ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 28 అంతస్తులున్న ఈ బంగ్లాలో రూ. 39 కోట్లు వెచ్చించి సల్మాన్ ఓ ట్రిపులెక్స్ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్ తండ్రి సలీంఖాన్ రూ.1.64 కోట్లు స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు చెప్పారు.
సల్మాన్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్కు కూతవేటు దూరంలోనే ఈ ఫ్లాట్ ఉండడం గమనార్హం. కత్రినాకైఫ్ విషయంలో గొడవపడి వైరం పెంచుకున్న వీరిద్దరు అన్నింటా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అదే పట్టుదలతో సల్మాన్ఖాన్ ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏక్ ధా టైగర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.