Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
39 కోట్లుతో ముంబైలో ప్లాట్ కొన్న మాస్ హీరో
బాలీవుడ్ మాస్ హీరో,కండల వీరుడు ఇప్పుడు ప్రతీ విషయంలోనూ షారూఖ్ తో పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే సల్మాన్ తాజాగా ఓ ట్రిపులెక్స్ ప్లాట్ ని కొనుగోలు చేసాడు. అదీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఇంటి ప్రక్కనే కావటం విశేషం. వివరాల్లోకి వెళితే.. కింగ్ఖాన్ షారూఖ్ ముంబై బాంద్రాలోని మన్నత్ బంగ్లాలో ఉంటున్నారు. అయితే ఆ బంగ్లా పక్కనే ఉన్న 'ది అడ్రస్' భవనంలో సల్మాన్ఖాన్ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 28 అంతస్తులున్న ఈ బంగ్లాలో రూ. 39 కోట్లు వెచ్చించి సల్మాన్ ఓ ట్రిపులెక్స్ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్ తండ్రి సలీంఖాన్ రూ.1.64 కోట్లు స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు చెప్పారు.
సల్మాన్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్కు కూతవేటు దూరంలోనే ఈ ఫ్లాట్ ఉండడం గమనార్హం. కత్రినాకైఫ్ విషయంలో గొడవపడి వైరం పెంచుకున్న వీరిద్దరు అన్నింటా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అదే పట్టుదలతో సల్మాన్ఖాన్ ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏక్ ధా టైగర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.