Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజమౌళీ హీరోయిన్ కెరీర్ ఊపందుకుంటోంది..!
ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఇటీవల వచ్చిన 'వీర' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో రవితేజ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొనే లేదు. అయితే, ఆ సినిమా దర్శకుడు రమేష్ వర్మ మాత్రం దానిని లైట్ తీసుకుని, తన తదుపరి చిత్రానికి అప్పుడే ఓపక్క సన్నాహాలు చేసేసుకుంటున్నాడు. స్క్రిప్టును కూడా రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే 'పల్లకిలో పెళ్ళి కూతురు", 'వారెవా" రెండు సినిమాలలో హీరోగా చేసినా... ఇంకా కెరీర్ ఏమాత్రం గాడిలో పడని హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడుగా నటిస్తాడు.
రాజమౌళి దర్శకత్వంలో మర్యాదరామన్న సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైన సలోనీని తాజాగా గౌతమ్ సినిమాకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో రమేష్ వర్మ రూపొందించిన 'ఒక ఊరిలో...' సినిమాలో సలోనీ కథానాయికగా నటించింది. ప్రస్తుతం తను 'తెలుగమ్మాయి' సినిమాతో బాటు బాలకృష్ణ, వెంకటేష్ నటిస్తున్న సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..!