Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళీ హీరోయిన్ కెరీర్ ఊపందుకుంటోంది..!
ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఇటీవల వచ్చిన 'వీర' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో రవితేజ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొనే లేదు. అయితే, ఆ సినిమా దర్శకుడు రమేష్ వర్మ మాత్రం దానిని లైట్ తీసుకుని, తన తదుపరి చిత్రానికి అప్పుడే ఓపక్క సన్నాహాలు చేసేసుకుంటున్నాడు. స్క్రిప్టును కూడా రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే 'పల్లకిలో పెళ్ళి కూతురు", 'వారెవా" రెండు సినిమాలలో హీరోగా చేసినా... ఇంకా కెరీర్ ఏమాత్రం గాడిలో పడని హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడుగా నటిస్తాడు.
రాజమౌళి దర్శకత్వంలో మర్యాదరామన్న సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైన సలోనీని తాజాగా గౌతమ్ సినిమాకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో రమేష్ వర్మ రూపొందించిన 'ఒక ఊరిలో...' సినిమాలో సలోనీ కథానాయికగా నటించింది. ప్రస్తుతం తను 'తెలుగమ్మాయి' సినిమాతో బాటు బాలకృష్ణ, వెంకటేష్ నటిస్తున్న సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..!