Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
అయ్యో ఇలా అయిందేంటి? గోర్లు కొరుక్కుంటూ సమంత ట్వీట్
సమంత నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరాయ్' తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విశాల్ హీరో. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మే 9న సమంత నటించిన 'మహానటి' విడుదలవుతుండటం, రెండు రోజుల గ్యాప్తో ఈ సినిమా వస్తుండటంతో సమంత అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తాజాగా తేలిన విషయం ఏమిటంటే మే 11న 'అభిమాన్యు' చిత్రం విడుదల కావడం లేదు. దీంతో సమంత టెన్షన్ పడుతూ గోళ్లు కొరుక్కుంటున్నట్లు ఓ ట్వీట్ చేశారు.
😱😱😱😱 *bitesnails https://t.co/rEVAtLhS3w
— Samantha Akkineni (@Samanthaprabhu2) April 23, 2018
తమిళనాడులో దాదాపు 50 రోజులుగా కొనసాగించిన ఇండస్ట్రీ సమ్మ ఇటీవలే ముగిసింది. ఏప్రిల్ 20 నుండి సినిమాలు అక్కడ విడుదలవుతున్నాయి. చాలా సినిమాల విడుదల పెండింగులో ఉంది. అందుకే ఈ సినిమాను వాయిదా వేశారట. ఈ విషయాన్ని విశాల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మే 11న ఈ చిత్రం విడుదల కావడం లేదు. మా నిర్మాణ సంస్థ 'వీఎఫ్ఎఫ్'ను సంప్రదించకుండా బయ్యర్లు తప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. తమిళనాడు నిర్మాణ సంఘ రిలీజింగ్ కమిటీని సంప్రదించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మేము అఫీషియల్గా చెప్పే వరకు మీడియా వారు తప్పుడు రిలీజ్ డేట్ ప్రచారం చేయవద్దు' అని విశాల్ ట్వీట్ చేశారు.