twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో ఇలా అయిందేంటి? గోర్లు కొరుక్కుంటూ సమంత ట్వీట్

    By Bojja Kumar
    |

    సమంత నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరాయ్' తెలుగులో 'అభిమన్యుడు' పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విశాల్ హీరో. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మే 9న సమంత నటించిన 'మహానటి' విడుదలవుతుండటం, రెండు రోజుల గ్యాప్‌తో ఈ సినిమా వస్తుండటంతో సమంత అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తాజాగా తేలిన విషయం ఏమిటంటే మే 11న 'అభిమాన్యు' చిత్రం విడుదల కావడం లేదు. దీంతో సమంత టెన్షన్ పడుతూ గోళ్లు కొరుక్కుంటున్నట్లు ఓ ట్వీట్ చేశారు.

    తమిళనాడులో దాదాపు 50 రోజులుగా కొనసాగించిన ఇండస్ట్రీ సమ్మ ఇటీవలే ముగిసింది. ఏప్రిల్ 20 నుండి సినిమాలు అక్కడ విడుదలవుతున్నాయి. చాలా సినిమాల విడుదల పెండింగులో ఉంది. అందుకే ఈ సినిమాను వాయిదా వేశారట. ఈ విషయాన్ని విశాల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

    మే 11న ఈ చిత్రం విడుదల కావడం లేదు. మా నిర్మాణ సంస్థ 'వీఎఫ్‌ఎఫ్'‌ను సంప్రదించకుండా బయ్యర్లు తప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. తమిళనాడు నిర్మాణ సంఘ‌ రిలీజింగ్‌ కమిటీని సంప్రదించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మేము అఫీషియల్‌గా చెప్పే వరకు మీడియా వారు తప్పుడు రిలీజ్ డేట్ ప్రచారం చేయవద్దు' అని విశాల్ ట్వీట్ చేశారు.

    English summary
    After several delays, Vishal and Samantha Akkineni starrer Irumbu Thirai(Abhimanyudu) was announced that it will hit the screens on May 11. However, Vishal has issued a statement denying the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X