twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్వైకల్ క్యాన్సర్ టీకా వేయించుకున్న సమంత

    By Bojja Kumar
    |

    చెన్నై: ఇటీవల పలువురు సెలబ్రిటీలు సర్వైకల్ కేన్సర్(గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్‌ ) బారిన పడిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మనీషా కొయిరాలాతో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ వ్యాధికి గురయ్యారు. అమెరికాలో చికిత్స చేయించుకుని సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయట పడ్డారు.

    సర్వైకల్ కేన్సర్ ప్రస్తుతం భారత్‌లో సర్వధారణం అయిపోయింది. అదే సమయంలో ఇది ప్రమాదకరమైది కూడా. ఏటా ఈ వ్యాధి కారణంగా దేశంలో వేలాది మంది మహిళలు చనిపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిపై దేశ వ్యాప్తంగా చైతన్యం కల్పిస్తూ... దాన్ని నిరోధించడానికి టీకాలు వేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు.

    హీరోయిన్ సమంత సర్వైకల్ క్యాన్సర్ టీకా మహిళలందరూ వేయించుకునేలా వారిలో చైతన్యం తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ టీకా(వాక్సిన్) వేయించుకున్న సమంత....తాజాగా చివరి డోసు కూడా వేయించుకుంది. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది.

    'సర్వైకల్ క్యాన్సర్ వేక్సిన్ చివరి డోసు కూడా వేయించుకున్నాను. అమ్మాయిలందరూ ఈ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించుకోవాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఈ వ్యాక్సిన్ విషయమై అవగాహన కల్పించండి' అని ట్వీట్ చేసింది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ వాక్సినేషన్ వేయించుకోవడం వల్ల...... సర్వైకల్ కేన్సర్ పై జనాల్లో అవగాహన త్వరగా చొచ్చుకెలుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    “Got my final cervical cancer vaccine shot…one less reason to be afraid.. Girls pls make sure u get vaccinated for u and ur family,” she revealed on Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X