Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మహేష్ నీళ్ళు తాగించాడంటున్న సమంత
"నా తొలి సినిమా పూర్తి కాగానే ఓ రోజు 'దూకుడు' కథ విన్నాను. అందులో హీరో ఎవరో ముందు తెలియదు. స్టోరీ ఆసక్తికరంగా అనిపించింది. చివరిగా మహేష్ పేరు చెప్పారు. అప్పుడప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న నాకు మహేష్తో సినిమా అనే సరికి ఆశ్చర్యం కలిగింది.అక్కడున్న గ్లాసుడు నీళ్ళు గడగడా తాగిస్తే కానీ మామూలు స్థితికి రాలేకపోయాను'' అని చెప్పింది సమంత. ఇక 'దూకుడు' లో అమ్మాయిలు ప్రాథమికంగా రెండు రకాలు. అబ్బాయిల్లోనూ రెండు రకాల వారుంటారు అనే డైలాగుని ప్రస్దావిస్తూ... సమంత "నేను ముక్కుసూటి మనిషిని. మొహమాటానికి పోయి అన్నీ నెత్తినేసుకోవడం నాకు నచ్చదు. అందుకే నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాను'' అని చెప్పింది.ఇక పెద్ద హిట్ కోసం అంతా ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన 'దూకుడు' చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయం పరిశ్రమకి ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాలో మహేష్ చాలా స్టైలిష్గా కనిపించి, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తన పొటెన్షియాలిటీని రుజువు చేసుకున్నాడు. ఈ యాక్షన్ సినిమాలో వినోదాన్ని అద్భుతంగా మిళితం చేసి శ్రీను వైట్ల అద్భుతంగా తీశాడని పరిశ్రమలోని పెద్దలు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు.మొదటివారంలోనే ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి లాభాలు పొందాలన్న నిర్మాతలు వ్యూహం సక్సెస్ అయినట్లైంది. మరో ప్రక్క చెన్నై లో ఈ సినిమా 15 థియేటర్లలో రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది.దీనికి తోడు దూకుడు ఇప్పుడు బెంగుళూరు నగరంలో సరికొత్త రికార్డుల మోతతో విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా విదేశాల్లో 'దబాంగ్" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి.
తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించింది . 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికాలో మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది.