Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబును జీవితంలో ఒక్కసారైనా ...సమంతా
మహేష్ బాబును జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకున్నాను. తీరా ఆయనతో నటించే అవకాశం వచ్చేసరికి నమ్మలేకపోయాను" అంటూ ఆ క్షణాల్ని గుర్తుచేసుకుంది సమంత. నాగచైతన్య హీరోగా చేసిన 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమెకు మహేష్ సరసన ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. ఈ ఆఫర్ వచ్చిన విధానం గురించి చెబుతూ..."మహేష్ అంటే ఎంతిష్టమో మంజులకి చాలాసార్లు చెప్పాను. ఇందిర ప్రొడక్షన్స్ ఆఫీసులో కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడే 'మహేష్ తో సినిమా చేస్తావా...?' అని అడిగారు. వాళ్లందరూ కలిసి ఆటపట్టిస్తున్నారని అనుకున్నా. తీరా సంతకం పెట్టమనేసరికి నమ్మలేకపోయాను. స్పృహ తప్పినంత పనైంది. నా పరిస్థితి చూసి నీళ్లు తాగించారు. అప్పుడుగానీ నేను స్థిమితపడలేదు..అదంతా కలగా ఉంది" అంది సమంత. సమంత ఎన్టీఆర్ సరసన బృందావనంలోనూ, దశరధ్, ప్రభాస్ కాంబినేషన్ చిత్రంలోనూ, సిద్దార్ధతో యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వంలో రూపొందే తమిళ, తెలుగు చిత్రంలోనూ కమిటైంది.