Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నాగచైతన్య, సమంత...ట్విట్టర్ లో క్యూట్ గా కబుర్లు
హైదరాబాద్ : సమంత, నాగచైతన్య తెరపైనే కాదు ...తెరవెనక ట్విట్టర్ లోనూ సరదాగా ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తున్నారు. తాజాగా నాగ చైతన్య... చేసిన ట్వీట్, దానికి సమంత ఇచ్చిన రిప్లై...మళ్లీ దానికి నాగ చైతన్య ఇచ్చిన సమాధానం.చివరగా సమంత కంక్లూజన్ ఆనందం కలిగిస్తున్నాయి. ఇంతకీ ..నాగచైతన్య ఏమన్నారు...
నాగ చైతన్య ట్వీట్ చేస్తూ.. "ఎక్కడ ప్రారంభమయ్యానో అక్కడకి వెళ్ళుతున్నాను..గౌతమ్ మీనన్ సార్..షూటింగ్ , రహమాన్ సంగీతం, ఇంకేం అడగగలను :-)" అన్నారు. దానికి సమంత సమాధానం ఇస్తూ... నువ్వు నన్ను అడగొచ్చు అంది. దానికి నాగచైతన్య వెంటనే...నేను అడుగుతాను..రేపటి నుంచి వచ్చేస్తావా అన్నాడు. దానికి ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయన్నట్లు రిప్లై ఇచ్చింది. మీరు ఇక్కడ చూడండి వారి కాన్సర్వేషన్...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
Nothing
like
being
back
to
where
it
all
started
for
me!
shooting
for
@menongautham
sirs
film,music
by
Rahman
sir,what
more
could
I
ask
fr:-)
—
chaitanya
akkineni
(@chay_akkineni)
May
13,
2015
అప్పుడెప్పుడో శింబు హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించి మధ్యలోనే దాన్ని వదిలేసిన గౌతమ్ మీనన్... అజిత్ తో ఎన్నై ఆరిందల్ సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో... శింబు హీరోగా 'అచ్చం ఎన్ బదు మడమైయడా' చిత్రాన్ని పునఃప్రారంభించాడు. గతంలో ఈ సినిమాలో హీరోయిన్ గా పల్లవి అనే హీరోయిన్ ను ఫైనలైజ్ చేసినప్పటికీ... ప్రాజెక్ట్ డిలే అవ్వడంతో ఆమె పక్కకు తప్పుకుంది.
దీంతో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టిన గౌతమ్ ఎన్నో ఆశలతో సమంత వద్దకు వెళితే ఆమె కూడా నో చెప్పేసింది.... దీంతో తెలుగులోనూ నాగచైతన్యతో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్న గౌతమ్ ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.
నాగ చైతన్య, సమంత.... కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేసేవె'తోనే జోడీ అదిరింది అనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన ‘ఆటో నగర్ సూర్య', ‘మనం' చిత్రాల్లోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు.
గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోయే సినిమాలోనూ సమంతనే తీసుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమెను కాకుండా మంజిమ మోహన్ అనే మళయాలం హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేసావే' సినిమా తర్వాత చైతన్య కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. తాజాగా మరోసారి నాగ చైతన్య అతని దర్శకత్వంలో చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. మంజిమ మోహన్ ఇప్పటికే పలు మళయాల చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.