Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ విక్టిమ్, మాటనిలుపుకున్న సమంత
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్(బాధితురాలు)కి సమంత అభిమానులు గతంలో రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. అభిమానులంతా కలిసి స్వచ్ఛందంగా ఈ ఫండ్ కలెక్ట్ చేసి సమంత చేతుల మీదుగా బాంబు పేలుళ్ల సందర్భంగా తన కాళ్లు కోల్పోయిన ఎంబీఏ విద్యార్థిని రజితకు ఈ మొత్తాన్ని అందజేసారు.
అప్పుడు సమంత మాట్లాడుతూ....రజితకు కృత్రిమ కాలు అమర్చేందుకు కావాల్సి మిగిలిన మొత్తాన్ని తాను సాయంగా అందిస్తానని మాట ఇచ్చింది. ఇచ్చినట్లుగానే సమంత మాట నిలబెట్టుకుంది. రూ. 2,30,000 రజిత చికిత్స కోసం సహాయం అందించింది.
కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, సమంత అనేక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుని తన సేవా భావాన్ని చాటుకుంటోంది. ప్రత్యూష పౌండేషన్ కోసం నిధుల సేకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాల్లో ఉపయోగించిన పాపులర్ సినీ స్టార్స్ డ్రెస్సులను వేలం వేసి, తద్వారా వచ్చే డబ్బును 'ప్రత్యూష ఫౌండేషన్' కోసం విరాళంగా ఇచ్చేందుకు ప్లాన్ చేసారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల సాధికరత కోసం పని చేస్తున్న 'ప్రత్యూష' చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా' అని సమంత ట్వీట్ చేసింది. పలువురు పాపులర్ స్టార్లకు సంబంధించిన వస్తువులను ఈ చారిటీ కార్యక్రమం కోసం వేలంలో అందుబాటులోకి తెస్తాం అంటోంది సమంత.