సమంత కమిటయిన కొత్త చిత్రం డిటేల్స్...
"ఏ మాయ చేసావె" చిత్రంతో పరిచయమైన సమంత తాజాగా రామ్ తో చిత్రం ఓకే చేసింది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విక్రమ్ శ్రీ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం మహేష్ తో "దూకుడు" చిత్రం చేస్తున్న ఆమె ఈ స్క్రిప్టు విని హైలెట్ గా అనిపించటంతో ఓకే చేసానంటోంది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన బృందావనం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంతో పాటు రామ్ ...సంతోష్ శ్రీనివాస్ అనే కెమెరామెన్ డైరక్ట్ చేయబోయే చిత్రలోనూ చేస్తున్నారు. రామ్ ప్రస్తుతం తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











