twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ హీరోయిన్ ట్రిపుల్ లక్కీ....!

    By Sindhu
    |

    సమంత 'ఏమాయ చేసావె"తో తెలుగులో తిరుగులేని ఇమేజ్ తెచ్చి పెట్టిన గౌతమ్ మీనన్ ఇప్పుడామెని తమిళ, హిందీ రంగాల్లోనూ పాపులర్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నాడు. సమంత, రామ్ తో తెలుగులో తీస్తున్న సినిమాని వేర్వేరు హీరోలతో హిందీ, తమిళంలోనూ గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. అన్ని బాషల్లోనూ సమంతే కథానాయికగా నటిస్తుంది.

    ఏమాయ చేసావె చిత్రాన్ని మూడు భాషల్లో చేసిన గౌతమ్ మూడు చోట్లా మూడు జంటలతో తీశాడు. అయితే ఈసారి మాత్రం సమంతనే అన్ని భాషల్లోనూ కథానాయికగా ఎంచుకున్నాడు. ఇది సమంతకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. తమిళంలో జీవా, హిందీలో ఆదిత్య రాయ్ కపూర్ హీరోలుగా నటిస్తున్నారు.

    తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంత తమిళనాట కూడా అదే పేరు దక్కించుకోవాలని ఎప్పట్నుంచో కోరుకుంటోంది. ఆ ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ఆమెకిప్పుడు బాలీవుడ్ లో కూడా గౌతమ్ పెద్ద బ్రేక్ ఇస్తున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక ఏ భాషలో ఎక్కువ నటించాలనే సందిగ్థంలో సమంత పడిపోయినా ఆశ్చర్యం లేదు.

    టాలివుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దూకుడు. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత కధానాయికగా వ్యవహరిస్తోంది.

    English summary
    Director Gautam Menon, who has given Samantha a big break in Tollywood, is all set to give her career a boost in Kollywood. If the buzz is to be believed, he will also launch her in Bollywood. Currently, Gautham is directing a bilingual in Telugu and Tamil with Samantha as the female lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X