Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్, మహేష్, పవన్ లే కాదు రామ్ తో కూడా...
"ఏ మాయ చేసావె" చిత్రంతో పరిచయమైన సమంత వరసగా పెద్ద హీరోలు సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో చేసిన "బృందావనం" తర్వాత ఇప్పుడు మహేష్ తో "దూకుడు" చిత్రం చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్, వివి వినాయిక్ కాంబినేషన్ కూడా ఓకే చేసింది. ఎంతసేపూ పెద్ద హీరోలే అనుకుందో ఏమో గానీ రామ్ హీరోగా చేయబోయే చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి కారణంగా సమంత మాట్లాడుతూ..రామ్ హీరోగా చెయ్యబోతున్న స్క్రిప్టు వినగానే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అందుకే ఆ చిత్రాన్ని ఆలోచించకుండా కమిటయ్యాను అంది. ఇక వరస ప్లాపుల్లో ఉన్న రామ్ అయితే సమంత ప్రాజెక్టులోకి రాగానే గోల్డెన్ టచ్ వచ్చినట్లుగా ఫీలయ్యి తన చిత్రం గ్యారెంటీగా హిట్టవుతుందని అందరికీ చెప్తున్నాట్ట, విక్రమ్ శ్రీ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు రామ్...సంతోష్ శ్రీనివాస్ అనే కెమెరామెన్ డైరక్ట్ చేయబోయే చిత్రలోనూ చేస్తున్నారు. రామ్ ప్రస్తుతం తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.