Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
ఆయనకు థ్యాంక్స్,కంగ్రాట్స్: సమంత
నాకు అవకాశం ఇచ్చింది, తెర మీద అందంగా చూపించింది గౌతమ్ మీనన్తోనే కదా. అందుకే ఈ నంది కూడా ఆయనకే దక్కుతుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఆయన కూడా నంది అందుకోబోతున్నారు. అందుకే ఒక థ్యాంక్స్, ఒక కంగ్రాట్స్ చెప్పేశా అంటోంది నవ్వుతూ సమంత. ఆమె నటించిన 'ఏ మాయ చేసావె'లో జెస్సీ పాత్రకు గానూ నంది ప్రత్యేక జ్యూరీ అవార్డునీ సొంతం చేసుకొంది.ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించింది.అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను గుర్తిస్తే చాలు అనుకొన్నాను. కానీ హీరోయిన్ గా నా స్థానాన్ని పదిలం చేశారు. ఇప్పుడీ నందీ అవార్డు. ఒక సినిమా... రెండు వరాలు అంటే ఇదే అంటూ ఆనందంగా చెప్తోంది.
ఇక ఈ అవార్డు వస్తుందని తాను ఊహించలేదంటూ... మరీ అన్ని ఆశల్లేవు. ప్రతి రోజూ ఈ సన్నివేశం ఎలా చేయాలి? సెట్లో ఎలా నడుచుకోవాలి? ఇలాగే ఆలోచించేదాన్ని. తెర మీద చూసుకొన్న తరవాత, 'హమ్మయ్య... పాసైపోయా' అని వూపిరి పీల్చుకొన్నాను. అంతకు మించి మరే ఆలోచనా ఉండేది కాదు. ఏ మాయ చేసావె విడుదల అయిన తరవాత కొన్ని సంస్థలు అందించిన అవార్డులు తీసుకొన్నాను. అప్పుడు కూడా నంది ఆలోచన రాలేదు అంది. ఇక హీరోయిన్స్ మధ్య పోటీ గురించి చెప్తూ.. పోటీ ఎక్కడైనా ఉంటుంది. అయితే ఆ పాత్ర నాకొస్తే ఎంత బాగుండును అనుకొనేంత వరకే. అంతేగానీ ఒకరి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోలేం కదా అంది.