Don't Miss!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఆయనకు థ్యాంక్స్,కంగ్రాట్స్: సమంత
నాకు అవకాశం ఇచ్చింది, తెర మీద అందంగా చూపించింది గౌతమ్ మీనన్తోనే కదా. అందుకే ఈ నంది కూడా ఆయనకే దక్కుతుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఆయన కూడా నంది అందుకోబోతున్నారు. అందుకే ఒక థ్యాంక్స్, ఒక కంగ్రాట్స్ చెప్పేశా అంటోంది నవ్వుతూ సమంత. ఆమె నటించిన 'ఏ మాయ చేసావె'లో జెస్సీ పాత్రకు గానూ నంది ప్రత్యేక జ్యూరీ అవార్డునీ సొంతం చేసుకొంది.ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించింది.అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను గుర్తిస్తే చాలు అనుకొన్నాను. కానీ హీరోయిన్ గా నా స్థానాన్ని పదిలం చేశారు. ఇప్పుడీ నందీ అవార్డు. ఒక సినిమా... రెండు వరాలు అంటే ఇదే అంటూ ఆనందంగా చెప్తోంది.
ఇక ఈ అవార్డు వస్తుందని తాను ఊహించలేదంటూ... మరీ అన్ని ఆశల్లేవు. ప్రతి రోజూ ఈ సన్నివేశం ఎలా చేయాలి? సెట్లో ఎలా నడుచుకోవాలి? ఇలాగే ఆలోచించేదాన్ని. తెర మీద చూసుకొన్న తరవాత, 'హమ్మయ్య... పాసైపోయా' అని వూపిరి పీల్చుకొన్నాను. అంతకు మించి మరే ఆలోచనా ఉండేది కాదు. ఏ మాయ చేసావె విడుదల అయిన తరవాత కొన్ని సంస్థలు అందించిన అవార్డులు తీసుకొన్నాను. అప్పుడు కూడా నంది ఆలోచన రాలేదు అంది. ఇక హీరోయిన్స్ మధ్య పోటీ గురించి చెప్తూ.. పోటీ ఎక్కడైనా ఉంటుంది. అయితే ఆ పాత్ర నాకొస్తే ఎంత బాగుండును అనుకొనేంత వరకే. అంతేగానీ ఒకరి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోలేం కదా అంది.