Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చచ్చిపోతానని బెదిరించాకే... : సమంత
హైదరాబాద్: వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సమంత ఈ మధ్యన చచ్చిపోతానని బెదిరించాల్సిన పరిస్ధితి ఏర్పడిందిట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఇంతకీ ఆమె ఎవరిని బెదిరించిందీ అంటే తన మేనేజర్ ని. ఆమె కి గత కొంతకాలంగా అసలు శెలవు తీసుకునే పరిస్ధితి కనపడటం లేదు. పెద్ద హీరోలు సినిమాలు,వరస షెడ్యుళ్లతో చాలా రెస్ట్ లెస్ గా కాలం గడుస్తోంది. దాంతో ఆమె రెండు రోజులు శెలవు తీసుకోవటానికి మేనేజర్ తో ఇలా పోట్లాడిందన్నమాట.
ఇక ఆమె ట్వీట్ ఇది..." So after a whole lot of kicking nd screaming (death threats included). I have bullied my manager into giving me a couple of days off bu ha ha. Off to London."
తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే సమంత అని చెప్తారు. దాంతో ఆమె వెంట ఎప్పుడూ మీడియా ఉంటుంది. ఆమె ఏం చెప్పినా ఓ రేంజిలో కవరేజ్ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని,ఇంటా బయిట నటన చేయకూడదని, తనను పబ్లిక్ మాత్రమే కాక పైవాడు గమనిస్తూనే ఉంటాడని చెప్తోంది. అయినా ఎవరో సంతోషం కోసం, మరొకర్ని బాధపెట్టడం కోసం తానెప్పుడూ నటించనని, నిజ జీవితంలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. మొత్తానికి నటన అనేది సెట్లోనే చేస్తానని, ఇంటికి వెళ్లాక సింపుల్గా ఉంటానని అంటుందీ అంటే పైనుంచి ఓ శక్తి తనను గమనిస్తుందన్న నమ్మకం ఉండబట్టే కదా అని శెలవిస్తోంది.
ఆమె మాట్లాడుతూ... మనం తప్పులు చేస్తే ఎవరూ చూడకపోయినా ఏదో శక్తి మాత్రం తప్పక చూస్తుందని, అందుకనే మన హద్దుల్లో మనం ఉంటేనే మంచిదని చెబుతోంది సమంత. ఒక్కసారి షూటింగ్ అయిపోయాక మేకప్ తీసేస్తే తాను సాధారణ అమ్మాయిలా మారిపోతానని, అక్కడ కూడా నటన చేయాలంటే తనకు నచ్చదని, కొంతమంది మేకప్ తీసేసాక కూడా నటిస్తూనే ఉంటారని చెబుతోంది. అటువంటివారిని మనం గమనించకపోయినా దేవుడు గమనిస్తాడని, అయినా వ్యక్తిగత జీవితంలో కూడా నటిస్తూపోతే, చివరికి నటనంటే బోర్ కొట్టదా అని అడుగుతోంది.
మరో ప్రక్క సమంత కూడా కొన్నాళ్ల వరకూ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండనని ప్రకటించింది. కారణం.. తమిళ, మలయాళ రంగాల్లో దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఎన్టీఆర్తో ఓ సినిమాలో నటిస్తోంది. 'మనం'లోనూ సమంతే కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికీ సంతకం పెట్టింది. వీటితో పుల్స్టాప్ పెట్టేసింది సమంత. కొత్త కథలు వినడం లేదు. విన్నా ఒప్పుకోవడం లేదు. ''గత మూడేళ్లుగా తెలుగు సినిమాతో మమేకమైపోయా. నటిగా నాకు భాషా బేధం లేదు. తమిళ, మలయాళ చిత్రాలనుంచీ ఆహ్వానం అందుతోంది. త్వరలో ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. అందుకే తెలుగు సినిమాలకు తాత్కాలికంగా దూరం అవుతున్నా'' అంటోంది సమంత.