Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సెకండ్ హనీమూన్: సమంత, చైతన్య ఫోటోస్ వైరల్!
టాలీవుడ్ న్యూ కపుల్ సమంత-నాగ చైతన్య ప్రస్తుతం అమెరికాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వారాల పాటు ఇక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏప్రిల్ 6న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పెళ్లి తర్వాత వీరు వెళ్లిన లాంగ్ వేకేషన్ ఇదే. దీంతో ఈ ట్రిప్ చై-సామ్ సెకండ్ హనీమూన్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యువజంట అమెరికాలోని మియామీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Recommended Video
మియామీలో
మియామీలోని విన్వుడ్ వాల్స్లో గ్రాఫిటీ పెయింటింగ్ ముందుకు సమంత, చైతన్య ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యాన్ని సమంత టీమ్ అభిమానులకు షేర్ చేశారు. మియామీలో చూడదగ్గ ముఖ్య మైన ప్రదేశాల్లో విన్వుడ్ వాల్స్ ఒకటి. ఇది ఓ అవుట్ డోర్ మ్యూజియం లాంటిది.
సమయం దొరికింది కాబట్టే
పెళ్లి తర్వాత నుండి వరుస సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న సమంత ఇటీవలే మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగానే ప్లాన్ చేసుకుని షూటింగులు ముగిసిన వెంటనే ఇద్దరూ అమెరికాలో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇద్దరూ మళ్లీ షూటింగుల్లో బిజీ కానున్నారు.
|
సమంత మూవీస్
సమంత నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'ఇరుంబు తిరై' చిత్రాలు షూటింగ్ పూర్తయి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 30న రంగస్థలం విడుదలవుతుండగా, మే 9న మహానటి విడుదల కానుంది. వెకేషన్ వెళ్లి వచ్చిన తర్వాత సామ్ తమిళ చిత్రాలైన సీమరాజా, సూపర్ డిలక్స్, తెలుగు మూవీ 'యూటర్న్' చిత్రాల షూటింగుల్లో జాయిన్ అవుతారు.
|
నాగ చైతన్య
నాగ చైతన్య ప్రస్తుతం ‘శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో నటిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సవ్యసాచి' విడుదలకు సిద్ధమౌతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక.
పెళ్లయిన తర్వాత కలిసి చేస్తున్న మూవీ
పెళ్లయిన తర్వాత సమంత, చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ కలిసి చేయబోతున్నారు. ఈ చిత్రానికి కంబైన్డ్ రెమ్యూనరేషన్ రూ. 7 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.